Wednesday, December 7, 2022

 

https://youtu.be/Xe7Y7_w-wsI?si=vy-TS74sZQOQPjAH

12) గోదాదేవి పన్నెండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: హంసానంది


కదలవే సుందరి గోపికా తక్షణము 

నిష్ఠగ చేయగా తిరుప్పావై వ్రతాచరణము

పొందెదము మనమిక శరణము 

రాయినే రమణిగ చేసిన  రామ చంద్రుని చరణము


1.పశుసంపద మిక్కిలి గల యదు శ్రేష్ఠుని చెల్లెలా

లేగలు పొదుగులు చేపగ కారిన పాలాయే బురదలా

మంచు కురియ తలలు తడవ వాకిట మాకేలా నీకై ఈ కాపలా

పండుకొన్నదిక చాలు లేలే ఇక గారాలు పోమాకే పసి పాపలా


2.తండ్రిమాట జవదాటని సాకేత రాముని కథను

పతి బాటను చేపట్టిన మహిజ సీత పాతివ్రత్య చరితను

తన సతినపహరించ దశకంఠు దునిమిన కోదండరామ గాథను

ఎలుగెత్తీ ఆలపించ వినిసైతం లేవనట్టి నీదెంతటి విడ్డూర మననూ

No comments: