Friday, December 23, 2022

 


https://youtu.be/w2SVrgaGNqE?si=O72i0C1Y9Dzle2E0

30) గోదాదేవి ముప్పయవ ఆఖరి పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:సిందు భైరవి


ఆచరణతొ ధన్యమగును జీవితము

శ్రీ రంగని కొలిచే  తిరుప్పావై వ్రతము

ధనుర్మాస మార్గళి నియమానుసారము

నోము నోచినంత తీరేను వాంఛితార్థము


1.సాగర మథనాన గిరిధర కూర్మావతారుడు

దానవుడగు కేశిని సంహారించినట్టి కేశవుడు

గోదాదేవి పాశుర వినుతుడు గోపాల కృష్ణుడు

ఆముక్తమాల్యద దాల్చిన ఆండాళ్ ప్రియవరుడు

కరుణించును వ్రత ఫలమున శౌరి భక్త వరదుడు


2.విష్ణుచిత్తుని ముద్దుల పట్టి గోదాదేవియే కవై

గోపికల అనుభూతులనల్లిన మాలే తిరుప్పావై

పఠితులకవి వరలును ఇహపరసాధకమగు త్రోవై

మన్నించును దోషములను హరి మననేలే ప్రభువై

నడిపించును సన్మార్గము మనల శ్రీ మహావిష్ణవై

No comments: