రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
మధిర త్రాగితే మత్తు కొందరికి
మధువు గ్రోలితే మత్తు కొందరికి
కైపెక్కుతుంది రాగానే నీ ముందరికి
మైకమన్నది మారు పేరు నీవంటి సుందరికి
-రసమంజరికి
1.సారాయిలో ఓలలాడె ఉమర్ ఖయ్యాము
అనార్కలి ప్రేమలో సమాధి ఐనాడు సలీము
లైలాను వలచి ఐనాడు నాడు మజ్నూ గులాము
ఉన్మత్తుల జేస్తుంది ఎవరినైనా నీ అపురూప రూపము
2.భ్రమరమునై భ్రమిసి పోతాను నిను గనినంత
బ్రాంతిలో మునుగుతాను నను నేనే మరచినీచెంత
నువురాకుంటే చింత వచ్చాక వెళ్ళిపోతావని చింత
మంత్రంవేస్తావో మాయలు చేస్తావో నీబానిస నవక పోతెనే వింత
No comments:
Post a Comment