రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:సిందుభైరవి
హే దీనదయాళా హే పరమ కృపాళా
శరణాగత వత్సలా చూపరా నీలీల
కరుణాలవాల ఆదరించరా నన్నీవేళ
1.నీ మోహన మధుమురళీ సుధలు గ్రోలనీ
నీ పదపద్మాల మ్రోల నా శిరసు వాలనీ
నీ దివ్య సన్నిధిలో సచ్చదానందమందు తేలనీ
అలౌకికానుభూతిలో నను శూన్యమై మిగలనీ
2.ఎన్ని జన్మలెన్ని వెతలు ఎన్నెన్నియాతనలు
ఎన్నగలేను నా దోషాలు కోరితి మన్ననలు
అలసినాను సొలసినాను ఐనా నిను వీడను
కలవనీ నీలో నను స్వామీ ఏదిక మరి వేడను
No comments:
Post a Comment