రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:భీంపలాస్
వీనులవిందాయే గోవిందా
నీ గానమె మందాయే భవరుగ్మత బాపంగ
పాడినవారి గళము పావనగంగ
భక్తుల హృదయమే ఉప్పొంగే సంద్రంగా
1.పలికించిరి హరిపద మకరందము
ఒలికించిరి సంకీర్తనామృతము
చిలికించిరి ఆరాధన నవనీతము
ఆస్వాదించిరి ఇహపర సౌఖ్యము
2.భక్తిభావ సుధకై కవనం మధించిరి
సంగీతమె జీవితమని సదా భావించిరి
నీ మహిమల నభినుతించి అనుభూతించిరి
కృతులనెన్నొ లిఖించి నిరతమాలపించిరి
No comments:
Post a Comment