Wednesday, February 12, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అమరేంద్రుని రాజధాని అమరావతి
ఆంధ్రులకూ అమరినది అమరావతి
భూతల స్వర్గమే అమరావతి
రాజకీయాల వల్ల ఎందులకీ దుర్గతి

1.బౌధ్ధారామమై వరలి ఖ్యాతి గన్నది
ఆంధ్రరాష్ట్రమంతటికీ నడిబొడ్డున ఉన్నది
కళింగ రాయల సీమలకూ కేంద్రబిందువైనది
ఆంధ్ర ప్రజల కందరికీ అందుబాటైనది
భూతల స్వర్గమే అమరావతి
రాజకీయాల వల్ల ఎందులకీ దుర్గతి

2.మౌలిక సదుపాయాలు కలిగియున్నది
అభివృద్ధికి తగురీతిగ వనరులు సిరులున్నది
ఉద్యోగ ఉపాదులకు సానుకూలమైనది
పరిశ్రమల కల్పనకూ పాటియై చెలగునిది
భూతల స్వర్గమే అమరావతి
రాజకీయాల వల్ల ఎందులకీ దుర్గతి

3.వ్యక్తుల స్వార్థాలకు బలిచేయుట తగదు
పార్టీల పగలకూ వేదిక ఇది కారాదు
రైతుల కన్నీటిని కాల రాయగా రాదు
పెట్టుబడుల విముఖతకు గురికారాదు
మూడు రాజధానుల ముచ్చటే విడూరం
దీర్ఘకాల లాభాలే ఎల్లరకూ సంబరం

No comments: