Friday, April 3, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ
మీరు సల్లంగా కాచే తల్లులె గదమ్మా
మిమ్ములను మొక్కంది దినామే గడువదు
మిమ్ములను కొలువంది పానామె ఊకోదు
ఊకూకే గిట్లైతే మేమెట్ల సచ్చూడో
తాపకో మామ్మారిని మీరెట్ల మెచ్చుడో
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

1.ప్లేగు మశూచీ కలరా స్ఫోటకపు వ్యాధులు
క్షయ డెంగ్యూ చికున్ గన్యా వంటి రోగాలు
ఎన్నిటినినుండి గట్టెక్కించినారో మమ్ముల
కడుపులవెట్టుక సక్కగ సాకినారో మమ్ముల
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

2.యాపమండలె బతుకు దీపాలాయే నాడు
పసుపు పూసుకుంటే మందాయే ప్రతి రుగ్మతకు
మైలబడకుండా శుచిగా ఉంటిమి  జబ్బుపడినప్పుడు
పత్యం పాటించి నిత్యం మిము తలచామప్పుడు
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

No comments: