Saturday, August 15, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

(జడి)వాన జల్లు పడుతోంది
నా ఒళ్ళు జిల్లు జిల్లంటోంది
ఈదురుగాలి వీస్తోంది
ఎదఎదో ఆదరువు కోరుతోంది
నులివెచ్చని చెలికౌగిలిలో వేవేల స్వర్గాలు
బొందితో దివినే చేరగ సంగమాలె మార్గాలు

1.ఎంతమంది పొందగలరు-పొందులోని మకరందాలు
ఎవరెవరు దర్శించారో-మదనాంతర మందిరాలు
ప్రదక్షిణలు చేసేలోగా సొమ్మసిల్లురెందరో
గర్భగుడిని చేరేలోగా అలసిపోదురెందరో
జేగంటకొట్టాలి హారతి చేపట్టాలి
దైవమనుగ్రహించాకే ప్రసాదాన్ని గ్రోలాలి

2.ముడుపు కట్టిన ముద్దులే-సమర్పించుకోవాలి
గుసగుసగా సుద్దులతో -అభినుతించి తీరాలి
నివేదించ ఆత్రమేల పత్రమో పుష్పమో
వల్లించాలి స్తోత్రమో మహా మంత్రపుష్పమో
పవిత్రంగ నిర్వర్తించగ రతి ముగితి ఏకమే
తనువులే వివశమైతే తాదాత్మ్యమే,సాలోక్యమే

No comments: