Wednesday, November 4, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసున ఉన్నది చెప్పేసెయ్

గుప్పిటికాస్తా విప్పేసెయ్

ఎన్నాళ్ళింకా దాయడం ఎదలో దావానలం

పంచే ప్రపంచమేలేదా నిప్పును అర్పే సలిలం


1.నలుగుతన్నదీ బ్రతుకంతా కలుగుకు పరిమితమై

వెలగనిస్తేనె జ్యోతిని తొలుగును తిమిరం హతమై

పసిడిదైతెమాత్రమేమి బంధిఖానయే పంజరము

రెక్కలున్నా ఎగరలేకా నిస్సహాయగా పావురము

త్రెంచేసెయ్ శృంఖలాలను వంచేసెయ్ చువ్వలను


2.మీనం మేషం లెక్కలలో జీవితమెప్పుడు దక్కదులే

తిరిగిపొందనిదె కాలమన్నది చేజార్తె క్షణమిక చిక్కదులే

మానవజన్మకు పరమార్థం పరమానందమొకటేలే

మనువు నుడివిన మనువంటే బాసల బాటలొ బాసటలే

సాధన చెసెయ్ సామవేదమే సాధించేసెయ్ గాంధర్వమే

No comments: