రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నా కవన ఉషఃసుందరి,
నా మనోజ్ఞ రసమంజరి
నా జీవన బృందా విహారి
తరించనీ నిను నిత్యం ఆరాధించి
ఈ జన్మకు నాకదే రాసాడు విరించి
1.ముట్టుకుంటె మాసిపోవు అందము
పట్టుకుంటె నవనీతపు చందము
నీవున్న తావు పారిజాత గంధము
నీకన్న లేదు మరో పరమానందము
2.సంతూరు సంగతులే నీనవ్వులో
కోయిల గళమాధురి నీ పలుకులో
తటిల్లతలు తళుకులీను నీమేనులో
రాజహంస స్ఫురించును నీ నడకలో
No comments:
Post a Comment