Saturday, December 10, 2022

 

https://youtu.be/3o5toGOulyo?si=EKCkBVq3SKdBtuej

13) గోదాదేవి పదమూడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: కర్ణరంజని


జాగృతి జాగృతి జాగృతి 

జాగిక సేయకు ఓ గోప పడతి

పద్మవదనా హరిణ నేత్రీ

ముగిసెను సుదీర్ఘ రాత్రి

జలకములాడే ఈ సమయాన

దుప్పటి ముసుగేయ తగునా

తిరుప్పావై నోమునోచగ-వేళమించునే

కపట నిదురమాని మా-మాట మన్నించవే


1.రావణుడి ప్రాణహారి రామ గుణ గాన లహరి

బకరాక్ష సంహారి యదునందన ముకుంద శౌరి

కీర్తనలే పాడుకొంటూ కన్యకలు చేరారు వ్రతస్థలి

పానుపింక వదిలేసి వేగిరముగ రావేమే నెచ్చెలి

తిరుప్పావై నోమునోచగ-వేళమించునే

కపట నిదురమాని మా-మాట మన్నించవే


2.గురుగ్రహం కనుమరుగై వేగుచుక్క పొడచింది

గూళ్ళు వదిలి పక్షిసమూహం నింగివంక ఎగిరింది

మిత్రుడి తొలికిరణం తూరుపింట మొలిచింది

శుభోదయం అంటూ నీకై గుడిగంటా మ్రోగింది

తిరుప్పావై నోమునోచగ-వేళమించునే

కపట నిదురమాని మా-మాట మన్నించవే

No comments: