Saturday, December 10, 2022

 https://youtu.be/e7KRUZPHbKY?si=-ej45F8KEcPRtkqN


14) గోదాదేవి పదునాలుగవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: హరి కాంభోజి 


కన్యకామణీ యదుకుల కలికి

అదమరిచి నిదురోయావా కలలో కులికి

అలసిపోయినావా కవ్వంతో పెరుగు చిలికి

మునగదీసుకున్నావా మము లేపెదవని బీరాలు పలికి

తయారుకావమ్మా మన సిరి వ్రతమును ఆచరించగా

శంఖచక్రధారి బృందా విహారి శౌరి లీలలాలపించగా


1)బుకాయింపు నీకేల తెల్లవారలేదని

శికాయతే ఊరంతా నంగనాచివేనని

కొలనులో కలువలే ముడుచుకొనే వేకువనేగని

ఎర్రని తామరలే విరియమురిసె రవియేతెంచునని

తయారుకావమ్మా మన సిరివ్రతమును ఆచరించగా

శంఖచక్రధారి బృందా విహారి శౌరి లీలలాలపించగా


2.గుడి పూజారుల అలజడులే వినలేదా

భక్తులు కదలాడే అలికిడి చెవిబడలేదా

నవ్వుకొందురే నలుగురు నీమొండి తనమునకు

గుసగుసలాడుదురే ప్రియసఖీ నీ పెంకె తనమునకు

తయారుకావమ్మా మన సిరి వ్రతమును ఆచరించగా

శంఖచక్రధారి బృందా విహారి శౌరి లీలలాలపించగా

No comments: