Saturday, December 17, 2022

 

https://youtu.be/hyAToMyzAJE?si=uLFm9VePZ3eZbYS4

22) గోదాదేవి ఇరవై రెండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:చారుకేశి


సురలు భూధరులు మునివరులు

నీ మేలుకొలుపుకై పడుదురు పడిగాపులు

అధికార మదమునొదిలి దేహమోహమూ వీడి

నీదరి కరుదెంచి నీ దయనాశించెడి పగిది

మేమంతా కూడివచ్చి నిలిచితిమి నీదివ్య సన్నిధి


1.విచ్చిన తామరల తీరు తెరువు ప్రభూ- నీ నేత్ర యుగళి

చల్లని కరుణను ప్రసరించు స్వామి-గొని వేగమే జాలి

మువ్వగోపాలా అలరించనీ అందమైన నీ నవ్వుల సరళి

మ్రోగించవో హృదయాను రాగాల తేల నీ మోహన మురళి


2.జగద్రక్షకా చాలించు నీ పరీక్ష ఓపలేము ప్రతీక్ష

సత్ఫలితమునందగా పూర్తిచేయనీ  శ్రీ వ్రత దీక్ష

నీ కృపాకటాక్ష వీక్షణతో పాపములే హరించ నీవె రక్ష

మేలుకొనవయ్య మమ్మేలుకొనగ నమో పుండరీకాక్ష

No comments: