Friday, December 2, 2022

 

https://youtu.be/jJNzcRSxryo?si=pqFrEinmRJcPjiGU

(6) గోదాదేవి ఆరవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మలయమారుతం


నీల మేఘ శ్యాముడు

లీలా మానుష విగ్రహుడు

గరుడ గమనుడు శేష శయనుడు

కొలువై ఉన్నాడు కోవెల లోన శ్రీ రంగనాథుడు

నిలుపరో చెలులార హృదయములోన రేపవలు

మేలుకొనరో ముదితలార చేయగ మార్గళి సేవలు


1.ఆలకించరో ఆరుబయట పక్షుల కువకువలు

వినరో మందిరమందున శంఖమూదు నాదాలు

మునులూ యోగులు ఒనరించు హరినామ స్మరణలు

భక్తుల ఎలుగెత్తు గోవింద గోవింద స్వన సందడులు

మేలుకొనరో ముదితలార చేయగ మార్గళి సేవలు


2. ఘాతకి పూతన పాలుత్రాగి హతమార్చినాడు

శకటాసురుని పదతాడనతో తుదముట్టించినాడు

మన్నుదిన్న కన్నయ్య మైమలు జనులు మరువరు

బాలకృష్ణుని ఎనలేని లీలలు ఎన్న జాలరెవరు

మేలుకొనరో ముదితలార చేయగ మార్గళి సేవలు

No comments: