Friday, December 2, 2022


https://youtu.be/i_MXwItjoYU?si=bLa1ShkmONN-PwN2

 7)గోదాదేవి ఏడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: శ్రోతస్విని 


కేశవ మాధవ ముకుంద శౌరి

గీతాలు ప్రియమార కోరి కోరి

ఆలపించెడి మా బృంద నాయకీ

కనకపోతిమి చెలీ నీ ఆచూకి

ఆదమరచి నిదురింతు వేల

శ్రీ వ్రతమాచరించెడి శుభవేళ


1.వేకువ జామాయే వేగిరపడవు

ఊరంత సందడి నీవేల వినవు

నీ నటనలు కడు విడ్డూరమే

నోము నోచుట నేరిగీ నిర్లక్ష్యమే

ఆదమరచి నిదురింతు వేల

అలసిన మిషతో బద్దకమేల


2.క్రౌంచ మిథునపు కీచు రొదలు

గొల్లభామల గాజుల సడులు

పెరుగు చిలికెడి వింత పదరులు

వినరావా రావాల హరి కీర్తనలు

ఆదమరచి నిదురింతు వేల

వేచితిమి నీకై పదపడి రావేల

No comments: