Tuesday, December 6, 2022

 

https://youtu.be/sh4Lqtrxw5c?si=4PRr86n5jPbQ47Ly

11) గోదాదేవి పదకొండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: మోహన


భామామణీ గొల్లభామామణీ

అందరిలోకి నీవె అందాల భరణి

యదుయోధుల వంశజవయ్యీ రాజిలు రాణి

సుగుణశీలివి ధైర్యశాలివి స్వర్ణలతాంగి రమణి

సుప్రభాత సమయమాయె వ్రతపు నియమమాయే

త్వరపడి నిదురలేచి రంగని మార్గళిసేవకు చనవాయే


1.వనమయూర ఛాయతో వరలే వనితామణీ

నీ జఘనము తలపించునే విప్పిన నాగ ఫణి

ఇరుగుపొరుగు ఇంతులు పాడిరి కృష్ణగీతాలని

ఎంతకూ ఉలకవు పలకవు కారణాలేవొ పూని


సుప్రభాత సమయమాయె వ్రతపునియమమాయే

త్వరపడి నిదురలేచి రంగని మార్గళిసేవకు చనవాయే


2.ఒరులకు బుద్దిగరపు శుభలక్షణ లక్షితవు

శ్రీ వ్రత నియమాలు నీవె దీక్షగ పాటింతువు

ఆవుల పొదుగుల పాలు పితుకు సడినీ వినవు

చెలులమంత చేరిచేసే ఈ అలజడినీ కనవు


సుప్రభాత సమయమాయె వ్రతపునియమమాయే

త్వరపడి నిదురలేచి రంగని మార్గళిసేవకు చనవాయే

No comments: