రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగంపహాడి
నరహరీ నీ దయ-మా బ్రతుకే నీదయ
నీ నామమే ధ్వనించు మా ఎద లయ
ఉఛ్వాస నిశ్వాసల నీ స్మరణమేనయా
నీ నీడలొ కడతేరుట మా ధర్మపురీయుల భాగ్యమయా సౌభాగ్యమయా
1.గోదావరి ఆలపించు నీ సంకీర్తన గలగలరావాలతో
కోనేరు పులకించు తెప్పోత్సవ డోలోత్సవాలతో
వరాహతీర్థము మురిసేను నీవే తనదరి చేరినంతనే
తామర పూలకొలను తరించును ఏటా తనకడ నీవొచ్చినంతనే
2.నీ సుప్రభాత గీతాలు మము మేలుకొలుపును
నదికి పోయి తానమాడ మా పాపాలు తొలగును
మందిరాన నీ సుందర రూపుగని ధన్యత నొందేము
నిత్యము నీ చింతనలో మునిగే మాకందరికీ
వైకుంఠప్రాప్తి తథ్యము
No comments:
Post a Comment