Sunday, October 18, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


దుర్గాభవాని-నేను నీ పసివాణ్ణి

పాలించగా నీవే-లాలించగానూ నీవే

మోకరిల్లుతున్నాను మాతా శాంభవి

ప్రణతులందుకోగదే తల్లీ భార్గవీ

వందనాలు నీకిదే అమ్మా వాగ్దేవి


1.నవరాత్రులూ నిన్ను నమ్మి కొలిచేను

ఏదినమందైనా నిన్నే తలిచేను

నా మనసే నీకు నైవేద్యమర్పింతు

నా ప్రాణజ్యోతులే హారతిగ వెలిగింతు

మోకరిల్లుతున్నాను మాతా శాంభవి

ప్రణతులందుకోగదే తల్లీ భార్గవీ

వందనాలు నీకిదే అమ్మా వాగ్దేవి


2.కోరడానికేముంది జననీ నీవెరగవనా

అడిగేది ఏముంది అమ్మా నువు ఈయవనా

బిడ్డ మనసు తెలిసి తల్లి మసలుకోదా

దొడ్డమనసు నీకుందన్నది లోకానికి కొత్తదా

మోకరిల్లుతున్నాను మాతా శాంభవి

ప్రణతులందుకోగదే తల్లీ భార్గవీ

వందనాలు నీకిదే అమ్మా వాగ్దేవి

No comments: