Saturday, December 17, 2022

 

https://youtu.be/qiIMpX9cFUg?si=fGdpeq34vVl7QVVL

20) గోదాదేవి ఇరువదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:ఆనంద భైరవి


నగుమోము రూపుడు నారద వినుతుడు నిరంజనుడు నీల శరీరుడు నులివెచ్చని దేహుడు నూఱుతప్పులు సైచినవాడు నృత్యప్రియుడు నెచ్చెలులు మెచ్చువాడు నేరేడు కనులవాడు నైకమాయు మిత్రుడు నొడుగు తేనియవాడు /

నోము ఫలమువాడు- నౌచరుడు భవజలధికివాడు/

నందకుమారుడు ఆనందకరుడగువాడికి నమో నమః


1.సురలకు సైతం భయహరుడు శ్రీ కృష్ణుడు

తెల్లారినా తెగదా గోపాలా నిను మేలుకొలుపుడు

స్వర్ణ కలశస్తని ప్రవాళ అధర భామిని నీలామణీ

నాజూకు నడుమున్న నీలాదేవీ నీవే భూ సిరివి

హరిని మనోహరుని మేల్కొపి సిద్ధపరచు జాగుమాని


2.నగధరునికి ప్రియ సతివని కోరితిమి శరణము

అందీయవె నోముకై వలయు ఆలవట్టం,దర్పణము

సపర్యలే చేయుచు సహకరించవే నందకిషోరునికి

నీరాడగ జేయవే నీ ప్రియ వరదుడిని మాతో కూడి

మదనగోపాలుని పదిలముగా లేపవే బ్రతిమిలాడి

No comments: